by Suryaa Desk | Mon, Oct 07, 2024, 07:12 PM
జగిత్యాల జిల్లాలోని రాయికల్ మున్సిపా లిటీకి కూతవేటు దూరంలో ఉన్న చెర్ల కొండాపూర్ గ్రామ స్తులు దశాబ్దాల ఫ్లోరైడ్ సమస్యతోనే బాధప డుతున్నట్లు అను మారిన వంటపాత్ర మానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాప్రతినిధులు, వైద్యాధికారులు ఇటువైపు కన్నెత్తి చూడకపోవడం తో ఈ విషయం వెలుగుచూడడం లేదన్న అప వాదు ఉంది. గ్రామంలోని ప్రతిఒక్కరి దంతాలు (పళ్లు) పసుపు రంగులోకి మారిపోవడం.. కీళ్ల నొప్పులతో బాధపడుతుండడంతో ఫ్లోరైడ్ సమస్యే అని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామంలో 1158 మంది జనాభా, 795 మంది ఓటర్లు ఉన్నారు.
వీరు తాగే నీటిలో ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణానికి రెం డు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలో ఫ్లోరైడ్ సమస్య ఉందన్న విషయం అధికారులకు తెలియదా.. తెలిసినా పట్టించుకోవడం .. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు తెలిసినా తెలియ నట్లు వ్యవహరిస్తున్నారా.. అని గ్రామస్తులు ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ ప్రజల దాహార్తిని తీర్చేందుకు నాలుగు చేతిపంపులు, వాటర్యాంక్ లు ఉన్నప్పటికీ నీటిలో ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉండటంతో సమస్య తీవ్రం అవుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రైవేటు వాటర్ ప్లాంట్ల నుంచి నీటిని కొనుక్కోవాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. కీళ్ల నొప్పులు, పంటి సమస్యలతో బాధపడుతున్న గ్రామస్తులు నీటి వనరులను పరీక్షలు చేస్తే సమస్య ఏంటో వెలుగుచూస్తుందని చెబుతున్నారు. ఎమ్మెల్యే. ఎమ్మెల్సీ స్పందించి ఫ్లోరైడ్ సమస్య లేకుండా చూడాలని, స్వచ్చంద సంస్థల సభ్యులతో మాట్లాడి వాటర్ ప్లాంట్లను మంజూరు చేయించాలని గ్రామ స్తులు కోరుతున్నారు.