by Suryaa Desk | Mon, Oct 07, 2024, 12:32 PM
ముదిరాజుల హక్కుల సాధన కోసం ఆదివారం వికారాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన జిల్లా ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొన కాసాని వీరేష్ .ఈ సందర్బంగా వీరేష్ మాట్లాడుతూ .. ముదిరాజ్ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పాల్గొని ముదిరాజ్ ల గొంతుకను గట్టిగా వినిపించడం సంతోషంగా ఉంది.ముదిరాజులు కిందస్థాయి నుంచి రాజకీయ నాయకులుగా ఎదిగి రాజ్యాధికారం చేపట్టేలా మనమంతా కలిసికట్టుగా, ఐకమత్యంతో పనిచేయాలి. కింది స్థాయి నుండి ముదిరాజ్ లీడర్ గా ఎదిగేందుకు మనమే ఒకరినొకరం సహకరించుకోవాలి. ముదిరాజ్ జాతి ఎదిగేందుకు హక్కులు సాధించడానికి చదువుకున్న యువత, పెద్దల సహకారం పరస్పరం ఉపయోగించుకోవాలి. రాజకీయంగా ఎదగాలనుకునే ముదిరాజులు మనం వెన్నుతట్టి కలిసికట్టుగా ప్రోత్సహించుకోవాలి. మన జాతిని ..జాతి గౌరావాన్ని ..ఔన్నత్వాన్ని చాటుదాం. ముదిరాజుల హక్కుల సాధన కోసం వికారాబాద్ జిల్లాలో ముదిరాజుల సమావేశాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.