by Suryaa Desk | Mon, Oct 07, 2024, 06:44 PM
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కేటీఆర్ కాలనీ, సాయి బృందావన్ కాలనీ, బాచుపల్లి ప్రాంతాలలో ఏర్పాటుచేసిన దుర్గా నవరాత్రి వేడుకలలో ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని కొలవడం ద్వారా చేపట్టిన ప్రతి కార్యంలో విజయం చేకూరుతుందన్నారు.
అమ్మవారు ప్రజలందరిని చల్లగా చూడాలని, సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలు కలిగించాలని వేడుకున్నారు. అనంతరం దేవాలయ సభ్యులు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, కార్పొరేటర్లు రాఘవేంద్ర రావు, బాలాజీ నాయక్, సీనియర్ నాయకులు సతీష్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.