by Suryaa Desk | Mon, Oct 07, 2024, 08:00 PM
రాష్ట్రవ్యాప్తంగా "సద్దుల బతుకమ్మ, దసరా పండుగలకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు అన్ని ఏర్పాట్లను చేసిందని ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. ఈ పండుగలకు రాష్ట్రవ్యాప్తంగా 6304 ప్రత్యేక బస్సులను నడుపుతోందని, ఈ సారి మహాలక్ష్మి పథకం అమలు నేపథ్యంతో రద్దీ దృష్ట్యా గత ఏడాదితో పోల్చితే అదనంగా 600 స్పెషల్ సర్వీసులను నడపాలని నిర్ణయించిందని తెలిపారు.