by Suryaa Desk | Mon, Oct 07, 2024, 01:51 PM
టీడీపీ పూర్వ వైభవం కోసమే ఆ పార్టీ అధినేత చంద్రబాబు ను కలిశామని మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి క్లారిటీ ఇచ్చారు. మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో చంద్రబాబును కలిశారు. మల్లారెడ్డి మనుమరాలు శ్రేయరెడ్డి పెళ్లికి రావాలని చంద్రబాబును ఆహ్వానించారు. ఈ సందర్భంగా తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతూ తాను తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నానని స్పష్టం చేశారు. ఎన్టీఆర్తో తమ రాజకీయ ప్రస్థానం మొదలైందని తెలిపారు. హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది చంద్రబాబేనని చెప్పారు. తెలంగాణ లో టీడీపీ పాలన మళ్లీ రావాల్సిన అవసరం ఉందన్నారు. వందశాతం తాను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నానని తీగల కృష్ణారెడ్డి వెల్లడించారు.