![]() |
![]() |
by Suryaa Desk | Wed, Apr 02, 2025, 05:18 PM
మెగా డాటర్ నిహారిక కొణిదెల గతేడాది కమిటీ కుర్రోళ్లు సినిమాతో నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్లో కొత్త డైరెక్టర్, కొత్త నటీనటులతో చిన్న సినిమాగా వచ్చిన కమిటీ కుర్రోళ్లు చిత్రం రూ. 50 కోట్ల వసూళ్లు సాధించింది. ఇప్పుడు నిహారిక నిర్మాతగా రెండో సినిమా వస్తోంది. నేడు నిహారిక తన రెండు సినిమాని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాల్లో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న యువ కథానాయకుడు సంగీత్ శోభన్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. సంగీత్ సోలో హీరోగా నటించనున్న తొలి సినిమా ఇదే. ఇది వరకే నిహారిక రూపొందించిన వెబ్ ప్రాజెక్ట్స్లో హీరో సంగీత్ శోభన్, డైరెక్టర్ మానస శర్మ భాగమయ్యారు. జీ5తో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ రూపొందించిన వెబ్ సిరీస్ ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’కి మానస శర్మ రచయితగా... సోనీ లివ్ రూపొందించిన ‘బెంచ్ లైఫ్’కి దర్శకురాలిగా పని చేశారు. తాజాగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ రూపొందించనున్న ఈ సినిమాతో మానస శర్మ ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్గా అరంగేట్రం చేస్తున్నారు. ఈ చిత్రానికి మానస శర్మ కథను అందించగా మహేశ్ ఉప్పల కో రైటర్గా స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. మన్యం రమేశ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు.
Latest News