|
|
by Suryaa Desk | Tue, Apr 08, 2025, 02:51 PM
బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ 'రైడ్ 2' తో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధంగా ఉన్నారు. ఇది మరొక థ్రిల్లింగ్ రైడ్గా ఉంటుంది అని భావిస్తున్నారు. ఈ చిత్రంలో నటుడు ఫియర్లెస్ ఐఆర్ఎస్ ఆఫీసర్ అమాయ్ పాట్నాయక్ గా కనిపించనున్నాడు. ఇది 2018 హిట్కు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీక్వెల్. మేకర్స్ ఈరోజు అధికారిక థియేట్రికల్ ట్రైలర్ను విడుదల చేసారు. ట్రైలర్ పాట్నాయక్ యొక్క 75వ దాడి చుట్టూ కేంద్రీకృతమై ఉంది. ఈసారి శక్తివంతమైన మరియు మోసపూరిత రాజకీయ నాయకుడు దాదా మనోహర్ భాయ్ ను లక్ష్యంగా చేసుకుంది. ఎడిటింగ్ మరియు గ్రిప్పింగ్ కథనంతో, ట్రైలర్ శక్తివంతమైన నేపథ్య స్కోరు ద్వారా మూవీ పై భారీ హైప్ ని క్రియేట్ చేసింది. రాజ్ కుమార్ గుప్తా సీక్వెల్ కి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రితేష్ దేశముఖ్ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో వాని కపూర్, రాజత్ కపూర్, సౌరభ్ శుక్లా కూడా నటించారు మరియు తమన్నా భాటియా ప్రత్యేక పాటలో కనిపించనున్నారు. పనోరమా స్టూడియోస్ మరియు టి-సిరీస్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం మే 1, 2025న విడుదల కానుంది. అమిత్ త్రివేది ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.
Latest News