![]() |
![]() |
by Suryaa Desk | Tue, Apr 08, 2025, 04:36 PM
చాలా రోజుల తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా తెలుగులో ఓ సినిమా చేస్తుంది. అదే ‘ఓదెల-2’. 2021లో విడుదలైన ‘ఓదెల రైల్వే స్టేషన్’ సినిమాకు సీక్వెల్గా ఈ సినిమా రాబోతుంది. ఈ మూవీ ఈనెల 17న థియేటర్లలో విడుదల కానుంది. అయితే, మూవీ ప్రమోషన్స్ కోసం చిత్రబృందం ఇవాళ ముంబైలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ క్రమంలో చిత్రబృందం ముంబైలోని బాబుల్నాథ్ ఆలయాన్ని సందర్శించారు. ఈ వీడియో వైరలవుతోంది.ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఓదెల 2 . 2021లో విడుదలైన “ఓదెల రైల్వే స్టేషన్” సినిమాకు సీక్వెల్గా ఈ సినిమా రాబోతుంది. సూపర్నాచురల్ థ్రిల్లర్గా రాబోతున్న ఈ సినిమాకు టాలీవుడ్ దర్శకుడు సంపత్ నంది కథను అందిస్తుండగా.. అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Latest News