![]() |
![]() |
by Suryaa Desk | Fri, Apr 11, 2025, 05:24 PM
బాబ్జీ దర్శకత్వం వహించిన తాజా మరియు సృజనాత్మక రాబోయే చిత్రం 'పోలీస్ వారి హెచ్చరిక' లో సన్నీ అఖిల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా యొక్క సెన్సార్ ప్రక్రియ జరుగుతోంది మరియు త్వరలో గొప్ప విడుదలకు ఈ చిత్రం సిద్ధం కానుంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా యొక్క ఆడియో లాంచ్ ఈవెంట్ ని రేపు హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్స్ లో సాయంత్రం 6 గంటల నుండి నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియయజేసేందుకు మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ఈ చిత్రంలో సన్నీ అఖిల్ కి జోడిగా ఖుషి మేఘన జోడిగా నటిస్తుంది. అజయ్ ఘోష్, శుభలేఖ సుధకర్, సయాజీ షిండే, రవి కాలే, హిమాజా, జయ వహిని, శంకరభరణం తులసి, ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. బెల్లి జానార్ధన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Latest News