![]() |
![]() |
by Suryaa Desk | Mon, Apr 14, 2025, 02:21 PM
సి. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో కోలీవుడ్ నటుడు కార్తీ నటించిన 'మెయ్యళగన్' తెలుగులో 'సత్యం సుందరం' అనే టైటిల్ తో విడుదల అయ్యింది. ఈ ప్రాజెక్ట్కి దర్శకత్వం చేయడమే కాకుండా ప్రేమ్ కుమార్ ఈ సినిమాకి కథ, స్క్రీన్ప్లే మరియు డైలాగ్లు రాశారు. ఈ సినిమా యొక్క తెలుగు వెర్షన్ శాటిలైట్ రైట్స్ ని స్టార్ మా మరియు స్టార్ మా మూవీస్ ఛానల్ సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా స్టార్ మా మూవీస్ ఛానల్ లో ఏప్రిల్ 18న సాయంత్రం 6 గంటలకి స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నట్లు ఛానల్ ప్రకటించింది. అరవింద్ స్వామి కూడా ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో రాజ్కిరణ్, శ్రీ దివ్య, స్వాతి కొండే, దేవదర్శిని, జయప్రకాష్, శ్రీ రంజని, ఇళవరసు, కరుణాకరన్, శరణ్, రేచల్ రెబెక్కా, ఆంథోని, రాజ్కుమార్, ఇందుమతి, రాణి సంయుక్త, కాయల్ సుబ్రమణి, అశోక్ పాండియన్, తదితరులు కీలక పాత్రలలో నటించారు. గోవింద్ వసంత ఈ సినిమాకి స్వరాలు సమకూరుస్తున్నారు. 2డి ఎంటర్టైన్మెంట్పై జ్యోతిక మరియు సూర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు, రాజశేఖర్ కర్పూరసుందరపాండియన్ సహ నిర్మాతగా ఉన్నారు. ఈ హిట్ చిత్రం ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం మరియు హిందీలో ప్రసారానికి అందుబాటులో ఉంది.
Latest News