![]() |
![]() |
by Suryaa Desk | Mon, Apr 14, 2025, 05:07 PM
ఆది సాయి కుమార్ ఇటీవలే విడుదల 'షణ్ముఖ' బాక్స్ఆఫీస్ వద్ద ప్లాప్ గా నిలిచింది. ఇప్పుడు నటుడు తన అప్ కమింగ్ ప్రాజెక్ట్ తో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధమవుతున్నాడు. యుగంధర్ ముని దర్శకత్వంలో రానున్న ఈ చిత్రానికి 'శంభాల' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఆది సాయి కుమార్ జియో సైంటిస్ట్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో అర్చన అయ్యర్ కథానాయికగా నటిస్తుంది. తాజాగా శంబాల మేకర్స్ ఈ సినిమా మేకింగ్ వీడియోని విడుదల చేసారు. శంబాలా ఒక ప్రత్యేకమైన టైటిల్ మరియు ఆసక్తికరమైన ఆవరణతో కూడిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్. స్వాసిక, రవివర్మ, మీసాల లక్ష్మణ్, మధు నందన్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హన్స్ జిమ్మర్ వంటి ప్రముఖ హాలీవుడ్ కంపోజర్లతో పనిచేసిన శ్రీరామ్ మద్దూరి ఈ చిత్రానికి సంగీతం అందించారు. రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి ఈ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.
Latest News