|
|
by Suryaa Desk | Fri, Apr 25, 2025, 04:51 PM
దర్శకుడు పూర్వాజ్ మరో గ్రిప్పింగ్ ప్రాజెక్ట్ కిల్లర్తో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధంగా ఉన్నారు. పూర్వాజ్ హీరో పాత్రను పోషిస్తుండగా, జ్యోతి పూర్వాజ్ హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా యొక్క గ్లింప్సె ని ఏప్రిల్ 30న మధ్యాహ్నం 12:06 గంటలకి విడుదల చేయనునంట్లు ప్రకటించారు. ఈ గ్లింప్సె తెలుగు మరియు కన్నడ లో విడుదల కానుంది. కిల్లర్ పార్ట్ 1 కోసం షూటింగ్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. మూడవ షెడ్యూల్ ఇప్పుడు పూర్తయింది. 50 శాతం షూటింగ్ పూర్తవడంతో తారాగణం కీ యాక్షన్, రొమాంటిక్ మరియు థ్రిల్లింగ్ సన్నివేశాలను చిత్రీకరించడంలో పాల్గొంది. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్గా కిల్లర్ పార్ట్ 1 చిరస్మరణీయమైన సినిమా అనుభవాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది. విశాల్ రాజ్ మరియు గౌతమ్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని పూర్వాజ్, ప్రజయ్ కామత్ మరియు ఎ. పద్మనాభా రెడ్డి థింక్ సినిమా బ్యానర్ కింద ఈ చిత్రాన్ని నిర్మించారు.
Latest News