|
|
by Suryaa Desk | Sat, Apr 26, 2025, 08:06 AM
అమర్ డీప్ చల్లాపల్లి దర్శకత్వం వహిస్తున్న "కర్మణ్యే వాధికారస్తే" అనేది సమకాలీన నేర ప్రపంచ సంఘటనల ఆధారంగా విభిన్న కథాంశంతో రానున్న చిత్రం. శివ కుమార్ పెల్లురు కథ మరియు సంభాషణలను అందించారు. శత్రు, బ్రహ్మజీ, మరియు 'మాస్టర్' మహేంద్రన్ ప్రధాన పాత్రలు పోషించగా, పృథ్వీ, శివాజీ రాజా, శ్రీ సుధా, బెనర్జీ, అజయ్ రత్నం మరియు ఇతరులు కీలక పాత్రలలో కనిపిస్తారు. తాజాగా ఇప్పుడు మేకర్స్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్రహ్మాజీ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ నటుడి ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు. అంతేకాకుండా ఈ చిత్రంలో నటుడు కిరీటి అనే పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించారు. ఎయిరా దయానంద్ రెడ్డి ఈ చిత్రంతో అరంగేట్రం చేస్తున్నారు. విశాఖపట్నం మరియు హైదరాబాద్లో చిత్రీకరించిన ఈ చిత్రం ప్రస్తుతం ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్ మరియు సరదీ స్టూడియోలలో పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. ఇది అన్ని ఫార్మాలిటీలను పూర్తి చేసిన వెంటనే విడుదల కోసం సన్నద్ధమవుతోంది. శత్రు, మాస్టర్ మహేంద్ర, బెనెర్జీ, ప్రుధ్వి, శివాజీ రాజా, అజయ్ రత్నం, శ్రీ సుధ, కృష్ణ భట్ , ఇరా దయానంద్, అయేషా, రెహనా ఖాన్, బాహుబలి మధు మరియు ఇతరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటర్. భాస్కర్ సమాలా సినిమాటోగ్రఫీని నిర్వహించారు. గయాని సంగీతాన్ని స్వరపరిచాడు. డిఎస్ఎస్ దుర్గా ప్రసాద్ ఈ చిత్రాన్ని ఉషాస్విని ఫిల్మ్స్ బ్యానర్ కింద నిర్మించారు.
Latest News