|
|
by Suryaa Desk | Sat, Apr 26, 2025, 08:20 AM
బహుముఖ నటుడు ధనుష్ దర్శకత్వం వహించిన తమిళ డ్రామా చిత్రం 'ఇడ్లి కడై' తో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధంగా ఉన్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా, ధనుష్ కథానాయకుడిగా నటించాడు. తాజాగా ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేసుకున్నట్లు సమాచారం. అరుణ్ విజయ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఈ విషయాన్ని అధికారికంగా ప్రాకటించారు. నిత్య మీనన్ మహిళా ప్రధాన పాత్ర పోషిస్తుండగా, అరుణ్ విజయ్ విరోధిగా నటించాడు. పార్థిబాన్ మరియు సత్యరాజ్ ఈ సినిమాలో సహాయక పాత్రలలో నటిస్తున్నారు. ఇడ్లీ కడై తెలుగులో "ఇడ్లీ కోటు" అనే టైటిల్ తో విడుదల కానుంది. వండర్బార్ ఫిల్మ్స్ మరియు డాన్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును బ్యాంక్రోలింగ్ చేస్తున్నాయి. ఈ సినిమాకి జివి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 1, 2025న విడుదల కానుంది.
Latest News