|
|
by Suryaa Desk | Tue, Apr 29, 2025, 11:56 AM
టాలీవుడ్ యువ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇటీవలే తన కొత్త ప్రాజెక్ట్ ని "చావు కబురు చాలగా" అనే హిట్ చిత్రానికి పేరుగాంచిన కౌశిక్ పెగళ్లపాటితో ప్రకటించారు. ఈ చిత్రానికి 'కిష్కీందపురి' అనే టైటిల్ ని మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ కనిపించనుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ చిత్రం యొక్క ఫస్ట్ గ్లింప్సె ఈరోజు అంటే ఏప్రిల్ 29, 2025న సాయంతరం 4:05 గంటలకి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. చిన్మయ్ సలాస్కర్ కెమెరా క్రాంక్ చేయనుండగా, కాంతారావు ఫేమ్ బి. అజనీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తున్నారు. మనీషా ఎ దత్ ప్రొడక్షన్ డిజైనర్ కాగా, డి శివ కామేష్ ఆర్ట్ డైరెక్టర్ గా ఉన్నారు. నిరంజన్ దేవరమానే ఈ చిత్రానికి ఎడిట్ చేయనున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గరిపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రతిభావంతులైన అజనీష్ లోక్నాథ్ ఈ సినిమాకి సంగీతాన్ని కంపోజ్ చేస్తున్నారు. శ్రీమతి షైన్ స్క్రీన్స్ బ్యానర్లో ప్రొడక్షన్ నెం. 8ని అర్చన సమర్పిస్తున్నారు.
Latest News