|
|
by Suryaa Desk | Wed, Apr 30, 2025, 03:55 PM
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం కూలీ మరియు జైలర్ 2 వంటి చిత్రాలతో బిజీగా ఉన్నారు. 'జైలర్ 2' తన హిట్ ఫిల్మ్ జైలర్కు సీక్వెల్ గా ఉంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం చురుకైన వేగంతో అభివృద్ధి చెందుతోంది. రజనీకాంత్, రమ్యా కృష్ణ మరియు ఇతర నటులతో ఈ షూట్ పూర్తి స్వింగ్లో కేరళలో జరుగుతుంది. నెల్సన్ దిలీప్ కుమార్ మరో 10-20 రోజుల్లో రజనీకాంత్ యొక్క భాగాన్ని పూర్తి చేయాలనీ యోచిస్తున్నాడు. ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమాలో టాలీవుడ్ నటుడు నటసింహ బాలకృష్ణ అతిధి పాత్రలో నటించనున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. రానున్న రోజులలో చిత్ర బృందం ఈ విషయాన్ని అధికారంగా ప్రకటించనున్నారు. ఈ చిత్రంలో రమ్య కృష్ణ, మిర్న మీనన్, యోగి బాబు కీలక పాత్రలో నటిస్తుండగా, శక్తివంతమైన అతిధి పాత్రలలో మోహన్ లాల్ మరియు శివరాజ్కుమార్ ఉన్నారు. 2026 వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్రణాళికలు ఉన్నాయి. ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీత దర్శకుడుగా ఉన్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
Latest News