|
|
by Suryaa Desk | Fri, May 30, 2025, 08:54 PM
పాన్-ఇండియన్ క్రైమ్ థ్రిల్లర్ అయిన "గగన మార్గన్"లో విజయ్ ఆంటోనీ తదుపరి కనిపించనున్నారు. బహుముఖ నటుడు ఇప్పుడు ఈ చిత్రంతో ప్రేక్షకులని అలరించనున్నారు. ఈ పాన్-ఇండియన్ క్రైమ్ థ్రిల్లర్ తో ప్రఖ్యాత ఎడిటర్ లియో జాన్ పాల్ దర్శకత్వ అరంగేట్రం చేస్తున్నారు. ఇటీవలే మేకర్స్ ఈ సినిమా యొక్క తెలుగు వెర్షన్ ట్రేలర్ ని విడుదల చేసారు. తాజాగా చిత్ర బృందం ఈ సినిమా ట్రైలర్ వన్ మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమాలో మెయిన్ విలన్ గా అజయ్ ధిషన్ నటిస్తున్నారు. ఈ సినిమాలో సముద్రఖని, మహానటి శంకర్, ప్రితిక, బ్రిగిడా సాగా, వినోద్ సాగర్, అజయ్ ధీషన్, దీప్శిఖ, కలక్క పోవదు ఎవరు అర్చన, కనిమొళి మరియు అంతగారం నటరాజన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజర్గా విజయ్ ఆంటోని ఉన్నారు. విజయ్ ఆంటోని హోమ్ బ్యానర్, విజయ్ ఆంటోని ఫిలింస్ కార్పొరేషన్పై 12వ ప్రొడక్షన్గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా జూన్ 27న విడుదలకి సిద్ధంగా ఉంది.
Latest News