|
|
by Suryaa Desk | Mon, Jun 02, 2025, 08:20 AM
కోలీవుడ్ నటుడు ప్రదీప్ రంగనాథన్ 'డ్రాగన్' తో మరోసారి భారీ బ్లాక్ బస్టర్ చేశాడు. ఈ చిత్ర 130 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. డ్రాగన్ ఇప్పుడు ఈ సంవత్సరం అత్యధిక తమిళ గ్రోస్సేర్ గా నిలిచింది. అశ్వత్ మారిముతు దర్శకత్వం వహించిన డ్రాగన్ తెలుగులో కూడా వాణిజ్యపరంగా విజయం సాధించింది. డబ్డ్ వెర్షన్ 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' పేరుతో విడుదల చేయబడింది. నెట్ఫ్లిక్స్ లో ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషలలో స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంది. ఈ సినిమా యొక్క తెలుగు వెర్షన్ శాటిలైట్ రైట్స్ ని స్టార్ మా సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా జూన్ 8న సాయంత్రం 6 గంటలకి వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ ని ప్రదర్శించనున్నట్లు సమాచారం. కయాడు లోహర్, అనుపమ పరమేశ్వరన్ మహిళా ప్రధాన పాత్ర పోషించారు. AGS ఎంటర్టైన్మెంట్ ఈ యూత్ కామెడీ ఎంటర్టైనర్ను నిర్మించింది. ప్రముఖ కోలీవుడ్ దర్శకులు గౌతమ్ వాసుదేవ్ మీనన్ మరియు మైస్కిన్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకి లియోన్ జేమ్స్ ట్యూన్స్ కంపోజ్ చేశాడు.
Latest News