|
|
by Suryaa Desk | Mon, Jun 02, 2025, 03:41 PM
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' అనే చిత్రంతో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధంగా ఉన్నారు. జులై 4, 2025న విడుదల కానున్న ఈ పాన్-ఇండియన్ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్నురి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కథ కూడా గౌతమ్ రాసుకున్నారు. ఈ సినిమా షూటింగ్ ని మేకర్స్ గత నెల పూర్తి చేసుకున్నారు. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, చిత్ర బృందం ఈ సినిమాకి సంబందించిన రీ షూట్ ని గోవాలో నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. కొంతకాలంగా నిర్మాణ దశలో ఉన్న ఈ చిత్రంలో విజయ్ స్పై ఏజెంట్గా కనిపించనున్నారు. ఈ చిత్రంలో భగ్యాశ్రీ బోర్స్ మహిళా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ చిత్రంలో నవ్య స్వామి, సత్య దేవ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అనిరుద్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.
Latest News