|
|
by Suryaa Desk | Mon, Jun 02, 2025, 05:13 PM
విజయ్ కనకమేడల దర్శకత్వంలో టాలీవుడ్ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రధాన పాత్రలో నటించిన 'భైరవం' సినిమా మే 30న విడుదల అయ్యింది. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్తో పాటు మంచు మనోజ్ మరియు నారా రోహిత్ కూడా ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. ఈ సినిమాలో అతిధి శంకర్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా సక్సెస్ అయ్యిన సందర్భంగా మేకర్స్ టూర్ ని చేస్తున్నట్లు ప్రకటించారు. జూన్ 3న ఉదయం 9 గంటలకి మచిలీపట్నంలోని మసులు ఫీస్ట్ లో బృందం పాల్గొననున్నారు. ఆ తర్వాత గుంటూరులోని భాస్కర్ థియేటర్ లో మ్యాట్నీ షోని వీక్షించనున్నారు మరియు విజయవాడలోని ట్రెండ్ సెట్ మరియు అలంకారలో ఫస్ట్ షో ని వీక్షించనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మేకర్స్ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసారు. ఈ సినిమాలో దివ్య పిళై, ఆనంది, ప్రముఖ దర్శకుడు సందీప్ రాజ్, అజయ్, శరత్, జయసుధ, సంపత్ రాజ్, గోపరాజు రమణ ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంభాషణలు సత్యర్షి మరియు తూమ్ వెంకట్ అందించగా, భాస్కర భట్ల, కాసర్ల శ్యామ్, చైతన్య ప్రసాద్, బాలాజీ మరియు తిరుపతి సాహిత్యం అందించారు. ఈ చిత్రం తమిళ బ్లాక్బస్టర్ గరుడన్ యొక్క అధికారిక తెలుగు రీమేక్. పెన్ స్టూడియోస్కు చెందిన డాక్టర్ జయంతిలాల్ గదా ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
Latest News