![]() |
![]() |
by Suryaa Desk | Wed, Apr 02, 2025, 11:42 AM
తెలుగు సినీ పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న 'కన్నప్ప' చిత్రం గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని చిత్ర బృందం స్పష్టం చేసింది. సినిమా ప్రీమియర్ షో వేశారంటూ వస్తున్న పుకార్లను నమ్మవద్దని కోరింది.మార్చి 31న 'కన్నప్ప' ప్రీమియర్ జరిగిందని కొందరు పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అందులో ఎలాంటి నిజం లేదని చిత్ర బృందం ఒక ప్రకటనలో తెలిపింది. విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పనులకు సంబంధించిన కొంత ఫుటేజ్ను మాత్రమే సమీక్షించామని, సినిమా ఫస్ట్ కాపీ సిద్ధం చేసే పనులు ఇంకా జరుగుతున్నాయని వారు తెలిపారు. సినిమాపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.సినిమాలో VFX పనులు చాలా ఉన్నాయి కాబట్టి, ప్రతి ఫ్రేమ్ను జాగ్రత్తగా తీర్చిదిద్దుతున్నామని, అందుకే ఎక్కువ సమయం పడుతుందని తెలిపారు. అభిమానులు, మీడియా ఇలాంటి నిరాధారమైన వార్తలను నమ్మవద్దని, త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తామని చిత్ర బృందం విజ్ఞప్తి చేసింది. 'కన్నప్ప' టీమ్ కష్టాన్ని అర్థం చేసుకుని సహకరిస్తున్న వారందరికీ వారు ధన్యవాదాలు తెలిపారు.ఇటీవల మోహన్బాబు, మంచు విష్ణు కలిసి నడుచుకుంటూ వస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో 'కన్నప్ప' ప్రివ్యూ జరిగిందని కొందరు ఊహాగానాలు చేశారు. వాటిలో నిజం లేదని చిత్ర బృందం తేల్చి చెప్పింది. ఏప్రిల్ 25న సినిమా విడుదల కావాల్సి ఉండగా, VFX పనుల కారణంగా వాయిదా పడింది. కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని మంచు విష్ణు తెలిపారు.
Latest News