![]() |
![]() |
by Suryaa Desk | Mon, Apr 07, 2025, 02:22 PM
టాలీవుడ్ నటుడు విక్టరీ వెంకటేష్ యొక్క అత్యధిక వసూళ్లు చేసిన చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం' బాక్సాఫీస్ వద్ద సంచలనాన్ని సృష్టించిన తరువాత డిజిటల్ ప్లాట్ఫారంలో కూడా అదరకొడుతుంది. ఈ చిత్రం గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల గ్రాస్ ని సాధించింది. ఈ సినిమా యొక్క శాటిలైట్ రైట్స్ ని జీ తెలుగు మరియు జీ సినిమాలు ఛానల్ సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా జీ తెలుగు ఛానల్ లో ఏప్రిల్ 13న సాయంత్రం 6 గంటలకి స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నట్లు ఛానల్ ప్రకటించింది. అనిల్ రవిపుడి దర్శకత్వం వహించిన ఈ కామెడీ కేపర్ లో ఐశ్వర్య రాజేష్ మరియు మీనాక్షి చౌదరి మహిళా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, VT గణేష్, మరియు మురళీధర్ గౌడ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం భీమ్స్ సిసిరోలియో స్వరాలు సమకుర్చారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ క్రింద దిల్ రాజు మరియు శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
Latest News