|
|
by Suryaa Desk | Tue, Apr 29, 2025, 03:28 PM
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తో ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఇటీవల విడుదల చేసిన ప్రకటన వీడియో అపారమైన సెన్సేషన్ ని సృష్టిస్తోంది. గత కొన్ని రోజులుగా, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం గురించి పుకార్లు ఉన్నాయి. తాజాగా ఇప్పుడు ప్రముఖ నటి అనన్య పాండే ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన నటిస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ అధికారిక ధృవీకరణ ఇంకా లేదు. ఇది నిజమైతే అది తెలుగు నటుడితో నటి రెండవ చిత్రం అవుతుంది. అంతేకాకుండా జాన్వీ కపూర్, మృణాల్ మరియు దిశా పాటని పేర్లు కూడా వినిపిస్తున్నాయి. రానున్న రోజులలో మేకర్స్ మహిళా ప్రధాన పాత్రలో ఎవరు నటిస్తున్నారో అధికారికంగా ప్రకటించనున్నారు. అట్లీ ఇప్పటికే ప్రాజెక్ట్ కోసం పూర్తి స్క్రిప్ట్ను పూర్తి చేసారు. ఈ చిత్రం శక్తివంతమైన డాన్ చుట్టూ తిరుగుతుంది మరియు మాఫియా నేపథ్యం ఉంది అని సమాచారం. అల్లు అర్జున్ను మూడు వేర్వేరు పాత్రలలో కనిపించనున్నట్లు టాక్. ఈ సినిమాని సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. యువ తమిళ సంగీత దర్శకుడు సాయి అభ్యంక్కర్ సౌండ్ట్రాక్ను స్కోర్ చేయనున్నారు. షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.
Latest News