|
|
by Suryaa Desk | Sat, May 31, 2025, 03:27 PM
విజయ్ కనకమేడల దర్శకత్వంలో టాలీవుడ్ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రధాన పాత్రలో నటించిన 'భైరవం' సినిమా మే 30న విడుదల అయ్యింది. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్తో పాటు మంచు మనోజ్ మరియు నారా రోహిత్ కూడా ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. ఈ సినిమాలో అతిధి శంకర్మ హిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. తాజాగా చిత్ర బృందం ఈ సినిమా యొక్క Q అండ్ A సెషన్ ని ఈరోజు సాయంత్రం 4 గంటలకి హైదరాబాద్ అవస హోటల్ లో నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమాలో దివ్య పిళై, ఆనంది, ప్రముఖ దర్శకుడు సందీప్ రాజ్, అజయ్, శరత్, జయసుధ, సంపత్ రాజ్, గోపరాజు రమణ ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంభాషణలు సత్యర్షి మరియు తూమ్ వెంకట్ అందించగా, భాస్కర భట్ల, కాసర్ల శ్యామ్, చైతన్య ప్రసాద్, బాలాజీ మరియు తిరుపతి సాహిత్యం అందించారు. ఈ చిత్రం తమిళ బ్లాక్బస్టర్ గరుడన్ యొక్క అధికారిక తెలుగు రీమేక్. పెన్ స్టూడియోస్కు చెందిన డాక్టర్ జయంతిలాల్ గదా ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సాంకేతిక బృందంలో సినిమాటోగ్రాఫర్ హరి కె వేదాంతం, మ్యూజిక్ కంపోజర్ శ్రీ చరణ్ పాకాల, ఎడిటర్ ఛోటా కె ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ బ్రహ్మ కడలి ఉన్నారు.
Latest News