|
|
by Suryaa Desk | Tue, Jun 03, 2025, 03:17 PM
బాలీవుడ్లో అతిపెద్ద కామెడీ ఫ్రాంచైజ్ హౌస్ఫుల్ ఇప్పుడు 5వ విడతో ప్రేషకుల ముందుకు వస్తుంది. తరుణ్ మన్సుఖానీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, మరియు రితేష్ దేశ్ముఖ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ మూవీ పై భారీ హైప్ ని సృష్టించింది. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ చిత్రం 225 కోట్ల (ముద్రణ మరియు ప్రకటనలను మినహాయించి) ప్రొడక్షన్ బడ్జెట్లో రూపొందించబడింది. ఇది దేశంలో ఇప్పటివరకు నిర్మించిన అత్యంత ఖరీదైన కామెడీ చిత్రంగా నిలిచింది. సాజిద్ నాడియాద్వాలా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, జక్క్యూలినే ఫెర్నాండేజ్, కృతి మహిళా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 6, 2025న విడుదల కానుంది.
Latest News