by Suryaa Desk | Sun, Jul 07, 2024, 04:32 PM
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్లో శనివారం చేరిన విషయం తెలిసిందే. కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో బండ్లపై కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిన మాజీ జడ్పీ ఛైర్ పర్సన్ సరిత ఆయన చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో కాంగ్రెస్ నేతలు సైతం ఇటీవల గాంధీ భవన్ ఎదుట ఆందోళన చేపట్టారు. తాజాగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరికతో ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది జిల్లాలో చర్చనీయాంశమైంది.