by Suryaa Desk | Wed, Jul 10, 2024, 11:03 AM
సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం రాయికోడ్ మండల పరిధిలో వెలసిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర ఆలయంలో బుధవారం ఉదయం ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు. అనంతరం ధూప దీప నైవేద్యం సమర్పించి మంగళహారతితో నీరాజనం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో దర్శించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు.