|
|
by Suryaa Desk | Fri, Mar 21, 2025, 12:19 PM
యాంకర్ శ్యామల తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. బెట్టింగ్ యాప్ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలని పిటిషన్ వేశారు. దీనిపై నేడు కోర్టులో విచారణ జరగనుంది. బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసినందుకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో శ్యామలపై కేసు నమోదైంది. బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన కేసులో పలువురు నటులు, సెలబ్రిటీలపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే.సామాజిక మాధ్యమాల్లో ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన కేసులో టీవీ యాంకర్ విష్ణుప్రియ, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ రీతూచౌదరిలను పంజాగుట్ట పోలీసులు నిన్న సుదీర్ఘంగా విచారించిన విషయం తెలిసిందే.
Latest News