by Suryaa Desk | Wed, Jun 26, 2024, 02:24 PM
కొల్లాపూర్ నియోజక వర్గం వీపనగండ్ల మండల కేంద్రంలోని 30 పడకల ప్రభుత్వ ఆస్పత్రికి నూతన అంబులెన్స్ ను కేటాయించారు. అంబులెన్స్ సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానిక కాంగ్రెస్ నేతలు, మండల ప్రజలు మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి స్పందిస్తూ. మంగళవారం అంబులెన్స్ సౌకర్యం కల్పించారు. ఈ సందర్భంగా మండల ప్రజలు, పార్టీ నేతలు మంత్రి జూపల్లికి కృతజ్ఞతలు తెలిపారు.