|
|
by Suryaa Desk | Mon, Mar 17, 2025, 06:02 PM
టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'జాత్' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమాతో గోపీచంద్ బాలీవుడ్లోకి అడుగుపెడుతున్నారు. ఇటీవల విడుదలైన యాక్షన్-ప్యాక్డ్ టీజర్ గణనీయమైన దృష్టిని ఆకర్షించింది మరియు ఈ చిత్రం ఏప్రిల్ 10, 2025న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని దాని ఒరిజినల్ హిందీ వెర్షన్తో పాటు తెలుగు మరియు తమిళంలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ధృవీకరించారు. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ట్రైలర్ ని మేకర్స్ త్వరలో విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. రానున్న రోజులలో చిత్ర బృందం అధికారక తేదీని వెల్లడి చేయనున్నది. నిధీ అగర్వాల్ హై-ఎనర్జీ స్పెషల్ సాంగ్లో కనిపించనున్నట్లు సమాచారం. రెజీనా కసాండ్రా, సయామీ ఖేర్ ఈ చిత్రంలో మహిళా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో రణదీప్ హుడా కూడా ప్రముఖ పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ స్వరాలు సమకూరుస్తున్నాడు. జాత్ను మైత్రీ మూవీ మేకర్స్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించాయి.
Latest News