by Suryaa Desk | Wed, Jul 10, 2024, 01:56 PM
వర్షాకాలం దృష్ట్యా జిల్లాలో సీజనల్ వ్యాధులు, ఇతరత్రా వ్యాధులు భారిన పడకుండా ప్రతి ఒక్కరినీ అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సిద్దిపేట అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్ అన్నారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కాన్ఫరెన్స్ హల్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారి ఆధ్వర్యంలో జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో ఆమె పాల్గొన్నారు.