by Suryaa Desk | Wed, Sep 11, 2024, 09:21 AM
వక్ఫ్ బోర్డు పరిధిలోని భూమిలో అనుమతి లేకుండా నిర్మాణాలు జరుగుతున్నాయని తంజీమ్ పెద్దలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు టౌన్ ప్లానింగ్ అధికారి నస్రీన్ భాను పరిశీలించారు. మంగళవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని నర్సాపూర్ చౌరస్తాలో సర్వేనంబర్ 471లో ఉన్న వక్స్ భూమిని పరిశీలించి జరుగుతున్న నిర్మాణాలను నిలిపివేయాలని ఆదేశించారు. నిర్మాణదారులు మున్సిపల్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.