by Suryaa Desk | Tue, Sep 17, 2024, 10:46 AM
రూ. 30 లక్షల 1 వెయ్యికి బాలాపూర్ గణేశుడి లడ్డూను కైవసం చేసుకున్న కొలను శంకర్ రెడ్డి.బాలాపూర్ గణపతి లడ్డూ మరోసారి రికార్డు ధర పలికింది. ప్రతి సంవత్సరం కొత్త రికార్డులు సృష్టించుకొని పైపైకి వెళ్తోంది బాలాపూర్ గణేష్ లడ్డూ. ఈసారి కూడా అందరి అంచనాలకు తగ్గట్టుగానే పోటాపోటీగా సాగింది వేలం. గత ఏడాది బాలాపూర్ లడ్డూ వేలం ధర 27 వేల రూపాయలు పలికింది. మొదట బాలాపూర్ గణనాధుడికి చివరిపూజ కార్యక్రమం నిర్వహించిన తర్వాత గణేశుడి ఉద్వాసన పూజ జరుగుతుంది. ఊరేగింపు అనంతరం గ్రామ బొడ్రాయి వద్ద లడ్డూ వేలంపాట జరుగుతుంది. అనాదిగా వస్తున్న సంప్రదాయం. 1994లో లడ్డూ ధరను కొలను మోహన్ రెడ్డి 450 రూపాయలతో తన సొంతం చేసుకున్నారు. అప్పటి నుంచి ధర పెరుగుతూనే ఉంది. అంటే ముప్పయి ఏళ్ల నుంచి లడ్డూ వేలంపాట జరుగుతుంది.కొత్త తీసుకొచ్చిన రూల్ ప్రకారం ముందుగా గతేడాది లడ్డూ అమ్ముడుపోయిన ధర డబ్బులు డిపాజిట్ చేస్తేనే ఈసారి వేలంలో పాల్గొనే అవకాశం ఇచ్చారు. అందుకే చాలా తక్కువ మంది ఈ డబ్బులు డిపాజిట్ చేసి వేలంలో పాల్గొన్నారు. గతేడాది 27 లక్షలకు లడ్డూ వేలంలో అమ్మడుపోయింది. దీంతో ఆ 27 లక్షలు డిపాజిట్ చేసిన కొద్ది మంది మాత్రమే ఈ వేలంలో పాల్గొన్నారు.