by Suryaa Desk | Thu, Sep 19, 2024, 03:08 PM
వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ మండలం పాత కోలుకుoదా గ్రామంలో సిపిఎం శాఖ మహాసభ రామయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్ పాల్గొని మాట్లాడుతూ సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఈనెల 12న అనారోగ్యంతో మరణించారు.ఆయనకు ఐదు నిమిషాలు నివాళులు అర్పించిన అనంతరం మూడవ శాఖ మహాసభ జరిగింది. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పొరట వారసులుగా,మనం ఏచూరి ఆశయాలు ముందుకు తీస్కపోవాలన్నారు. గ్రామాల్లో మండల పరిధిలోని అనేక గ్రామాల్లో అధిక వర్షాలకు దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం వెంటనే నష్ట పరిహరమూ ఇవ్వాలి. దేబ్బతిన రోడ్డు నిర్మాణం చెయ్యాలి గ్రామాల్లో సీసీరోడ్డు మరీలు విది లైట్స్ ఏర్పాట్లు చెయ్యాలి, కరెంట్ పోల్స్ వేషి లైన్ ఇవ్వకుండా ఉంచారు వెంటనే తొలగించాలి.శ్మశానవాటిక లో లైట్స్ మంచినీల్ల బోర్స్ ఏర్పాట్లు చెయ్యాలి.
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మంచినీళ్లు టైలెట్స్ అటవస్తులు ఇవ్వాలి. స్కూల్ చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణనలు చెయ్యాలి. ఆట ప్లే గ్రౌండ్, ఆట వస్తులు ఇప్పించాలి రైతు ఇవ్వాలి,రైతు రుణమాఫీ అందరికీ ఇబ్బంది లేకుండా చెయ్యాలి. ప్రభుత్వ భూలో సాగులో ఉన్న పేదలకు పట్టలు ఇవ్వాలి. పొలాల వద్ద కరెంటు ట్రాన్స్ పొరం సమస్య పరిష్కారం చేయాలి అన్నారు. జిల్లా కార్యవర్గ సభ్యులు y సతీష్ లు పాల్గొని మాట్లాడుతూ ఈ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి. రైతు రుణమాఫీ ఆధార్ కార్డు రేషన్ కార్డు లింక్ లేకుండా లాన్స్ మఫీ చెయ్యాలి. అధిక వర్షాలకు నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం ఎకరాకు 50వేల చొప్పున ఇవ్వాలి. గ్రామంలో వీధిలైట్లు సిసి రోడ్లు మురికి కాలువలు వెంటనే బాగు చేయాలి. వర్షాలకు కూలిపోయిన ఇండ్లకు లక్ష రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలి. మండలం భూమిని లేని పేదలకు ప్రభుత్వం భూముల్యూవ్వాలి సాగులో ఉన్న వారికి పట్టాలు ఇవ్వాలని ఈ గ్రామాల మధ్యన ఆర్ అండ్ బి రోడ్లను వెంటనే బాగు చేయాలి ఆ గ్రామాలకు వికారాబాద్ నుండి మూడు సార్లు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలి. సిపిఎం పార్టీగా ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం.ధరణి సమస్య పరిష్కారo చెయ్యాలి. చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అన్నారు. నిరంతరం ఎర్రజండ పేదల పక్షాన నిలబడుతుంది అన్నారు. ఈ సిపిఎం శాఖ, మండల, జిల్లా, రాష్ట్ర ఆలిండియా మహాసభలు జరుగుతున్న సందర్భంగా గత కార్యక్రమాలు చర్చించి, భవిష్యత్తు కార్య చరణ రూపొందిస్తున్నమని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం శాఖ కార్యదర్శి నరేష్ రామయ్య రాజు అశోక్ కుమార్ రాజు శివ బాబు మాసన్న తదితరులు పాల్గొన్నారు.