![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 18, 2025, 03:07 PM
పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్లాల్ హీరోగా భారీ అంచనాలున్న మలయాళ చిత్రం ఎల్2 ఎంపురాన్ మార్చి 27, 2025న థియేటర్లలోకి రానుంది. లూసిఫెర్ ఫ్రాంచైజీలో L2 ఎంపురాన్ రెండవ విడత. ఈ చిత్రంలో టోవినో థామస్, ఇంద్రజిత్ సుకుమారన్, మంజు వారియర్, సానియా అయ్యప్పన్ మరియు అర్జున్ దాస్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క కర్ణాటక డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని ప్రముఖ బ్యానర్ హోంబ్లే ఫిలిమ్స్ సొంతం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమా మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. మలయాళ పరిశ్రమలో చాలా అంచనాలు ఉన్న ప్రాజెక్ట్లలో ఒకటిగా, L2 ఎంపురాన్ బ్లాక్ బస్టర్ అవుతుందని భావిస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ సారథ్యంలో, మోహన్ లాల్ తారాగణంతో సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం దీపక్ దేవ్ అందించగా, సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అఖిలేష్ మోహన్ ఎడిటింగ్ చూసుకుంటున్నారు. ఆశీర్వాద్ సినిమాస్ మరియు లైకా ప్రొడక్షన్స్ పతాకాలపై ఆంటోని పెరుంబవూర్ మరియు అల్లిరాజా సుభాస్కరన్ సంయుక్తంగా ఎల్ 2 ఎంపురాన్ చిత్రాన్ని నిర్మించారు.
Latest News