by Suryaa Desk | Sun, Sep 15, 2024, 10:44 PM
రైతుల ట్రాక్టర్ ట్రక్కులే లక్ష్యంగా పెట్టుకున్న దొంగల ముఠా ఆగడాలను సూర్యాపేట జిల్లా పోలీసులు చెక్ పెట్టారు.. 22 లక్షల 92వేలు గల 18 ట్రక్కులను చాకచక్యంగా పట్టుకున్నారు. దొంగలను విచారించగా సూర్యాపేట జిల్లాలోని మునగాల, పేన్ పహాడ్, మిర్యాలగూడ రూరల్, నాగారం, మద్దిరాల, గుర్రంపోడు, నూతనకల్ ,మోతే, గరిడేపల్లి, శాలిగౌరారం, సూర్యాపేట రూరల్, కేతేపల్లి, గ్రామాల్లో ఉన్న రైతుల ట్రక్కులను దొంగలించి తక్కువ ధరకు ఇతర రైతులకు అమ్ముతున్న ముఠాను గుర్తించామని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు.
సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్,తుంగతుర్తి సీఐ శ్రీను, సిసిఎస్ ఎస్ఐ శ్రీకాంత్, ముదిరాల ఎస్సై వీరన్న, పర్యవేక్షణ చేసి డిఎస్పి రవి, సిసిఎస్ సిబ్బంది,వెంకన్న, శ్రీనివాస్, గురు స్వామి, మల్లేష్, ఆనంద్, శివ, సతీష్, ప్రభాకర్ లను ఎస్పీ అభినందించి రివార్డు అందించారు...