![]() |
![]() |
by Suryaa Desk | Sat, Mar 15, 2025, 11:18 AM
విక్టరీ వెంకటేశ్ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా సూపర్ హిట్ అయింది. ఈ చిత్రం రూ. 300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరిలు కథానాయికలుగా నటించారు.ఈ చిత్రం ఇటీవలే అటు టీవీతో పాటు, ఇటు ఓటీటీలోకి వచ్చింది. టీవీ ప్రీమియర్ టీఆర్పీ రేటింగ్ లో ఈ సినిమా సరికొత్త రికార్డు సృష్టించింది. మార్చి 1న సాయంత్రం 6 గంటలకు జీ తెలుగు ఛానల్లో ఈ చిత్రం టెలికాస్ట్ అయింది. ఈ చిత్రానికి ఏకంగా 15.92 రేటింగ్ నమోదయింది. ఈ రేటింగ్ కేవలం జీ తెలుగు ఎస్డీ ఛానల్స్ కు సంబంధించినది. జీ తెలుగు హెచ్డీలో 2.3 రేటింగ్ సొంతం చేసుకుంది. మొత్తంగా 18కి పైగా రేటింగ్ నమోదయింది.మార్చి 1న సాయంత్రం 6 గంటలకు ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమయింది. తొలి 12 గంటల్లోనే ఏకంగా 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ నమోదయ్యాయి. ఆర్ఆర్ఆర్, హనుమాన్ వంటి సినిమాల రికార్డులను కూడా ఈ చిత్రం బద్దలుగొట్టింది. 200 మిలియన్లు, 300 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ రికార్డులను కూడా సొంతం చేసుకుంది.
Latest News