by Suryaa Desk | Wed, Jun 26, 2024, 01:45 PM
ప్రాజెక్టులు, వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించి పెండింగ్ లో ఉన్న భూసేకరణ పనులను వెంటనే ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి రెవెన్యూ, ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో భూసేకరణ, పునరావాస కేంద్రాలపై రెవెన్యూ, ఇతర సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి భూ మసేకరణ ఎక్కడా పెండింగ్ లో ఉండకుండా చూసుకోవాలన్నారు