by Suryaa Desk | Tue, Oct 08, 2024, 09:28 AM
వరంగల్ మట్టెవాడ పరిధిలో ఓ ఇంట్లో పేకాట శిబిరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు సోమవారం రాత్రి దాడి చేసి ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు.
వారి నుంచి రూ. 8, 340 నగదు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. వరంగల్కు చెందిన గుండా దిగంబర్, కోట వర్ధన్, కట్కకం ప్రశాంత్, జన్ను కిరణ్, తాళ్ల రాకేష్, బీరెళ్లి రాజును అదుపులోకి తీసుకొని మట్టెవాడ పోలీసులకు అప్పగించారు.