by Suryaa Desk | Tue, Oct 08, 2024, 09:14 AM
ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని ఎమ్మెల్యే బొజ్జ సోమవారం అన్నారు. జన్నారం మండలంలోని కామన్ పల్లి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఆయన కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు.
అన్ని గ్రామాలలో ఉన్న ప్రజలకు ప్రభుత్వాసుపత్రుల ద్వారా వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.