by Suryaa Desk | Tue, Oct 08, 2024, 08:25 AM
వివిధ కార్యక్రమాలలో డిజే సౌండ్ వలన విపరీత శబ్దంతో అనారోగ్య సమస్యలతో పాటు శబ్ద కాలుష్యం కూడా వస్తుందని ఉద్దేశంతో ప్రభుత్వం డీజే సౌండ్ పై నిషేధం విధించింది.
వివిధ శుభకార్యాలు వంటిఅనేక సభలు సమావేశాలలో డీజేని నిషేధించడంతో వాటి యజమానులు డీజేని అనుమతించాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించి కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. డీజే సౌండ్ యజమానులు క్లాక్ టవర్ నుండి ర్యాలీ నిర్వహించి ధర్నా నిర్వహించారు.