by Suryaa Desk | Tue, Oct 08, 2024, 09:33 AM
నందిపేట్ బస్స్టాండ్లో ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలు, షీ టీం, సీసీ కెమెరాల ప్రాధాన్యత, కెయిర్ పోర్టల్, డయల్ 100 మరియు సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1930 గురించి నిజామాబాద్ పోలీసు కళా బృందం వారు నందిపేట్ పోలీసు స్టేషన్ పరిధిలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండి, ఏదైనా సమస్య ఉన్నపుడు తక్షణమే సంబంధిత నంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు అందించాలని సోమవారం పోలీసు శాఖ వారు తెలియజేశారు.