by Suryaa Desk | Tue, Oct 08, 2024, 08:51 AM
మహబూబ్ నగర్ జిల్లా చిన్నదర్పల్లి 15వ వార్డులో స్వయంభూ శ్రీలక్ష్మీ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో రూ. 10 లక్షలతో నూతనంగా నిర్మించిన శ్రీలక్ష్మీ గోశాల షెడ్ ను, సీసీరోడ్ లను సోమవారం మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.
అనంతరం శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ పాల్గొన్నారు.