by Suryaa Desk | Tue, Oct 08, 2024, 09:36 AM
బోధన్ పట్టణంలోని శ్రీ సరస్వతి నగర్ దేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నల్ల పోచమ్మ మందిరం వద్ద సహస్ర దీపాలంకరణ సేవా కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. మహిళలు భారీ సంఖ్యలో ఆలయం వద్దకు తరలివచ్చి కార్యక్రమంలో భక్తి శ్రద్దలతో పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మంగళవారం 12: 30 నిమిషాలకు ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం చేపట్టనున్నారు. భక్తులు భారీ సంఖ్యలో తరలిరావాలని కోరారు.