by Suryaa Desk | Tue, Oct 08, 2024, 08:40 AM
రైతులకు ఇబ్బంది లేకుండా పత్తిని కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి సోమవారం అధికారులను ఆదేశించారు. నల్గొండ జిల్లాలో 23 పత్తి కొనుగోలు కేంద్రాలను.
ఈ నెల 15 లోగా ప్రారంభించాలని సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం పొడవు పింజ పత్తికి రూ. 7, 521, మధ్యస్థ గింజ పత్తికి రూ. 7, 121 మద్దతు ధరను ప్రకటించిందన్నారు. కొనుగోలుదారులు మద్దతు ధర కన్నా తక్కువగా కొనుగోలు చేయవద్దన్నారు.