by Suryaa Desk | Tue, Oct 08, 2024, 08:17 AM
కార్యకర్తల కృషితోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని తప్పకుండా వారి రుణం తీర్చుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
సోమవారం దేవరకొండ మాల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బాలు నాయక్, జయవీర్ రెడ్డి, నూతన మార్కెట్ కమిటీ చైర్మన్లు జామునారెడ్డి, అలివేలు సంజీవ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.