by Suryaa Desk | Tue, Oct 08, 2024, 09:02 AM
జిల్లాలో పెండింగ్ ఉన్న ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేసేందుకు పక్కా కార్యచరణతో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు.
సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై అధికారులతో సమీక్ష నిర్వహించి, పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, అధికారులు పాల్గొన్నారు.