by Suryaa Desk | Tue, Oct 08, 2024, 09:26 AM
డెంగ్యూ జ్వరంతో యువకుడు మృతి చెందిన ఘటన ములుగు జిల్లాలో చోటుచేసుకుంది. ములుగు మండలంలోని చిన్న గుంటూరుపల్లి గ్రామానికి చెందిన సచిన్ (25) గత నాలుగు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో సచిన్ వివిధ ఆస్పత్రిలో చికిత్స పొందాడు.
ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సచిన్ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.