by Suryaa Desk | Tue, Oct 08, 2024, 09:34 AM
నందిపేట మండల కేంద్రానికి చెందిన మాజీ ఎంపీటీసీ ఎలిగేటి రాజు నిజామాబాద్ బీఎస్ఎన్ఎల్ టెలికాం అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా ఎంపిక అయ్యాడు.
ఈ కమిటీ బీఎస్ఎన్ఎల్ సంస్థ చేసే సేవల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ కమిటీ వినియోగదారుల సమస్యల పరిష్కారంలో బీఎస్ఎన్ఎల్ సంస్థ యొక్క పనితీరు మరియు వినియోగదారులకు సంస్థకు మధ్య వారధిలా పని చేస్తుందని రాజు సోమవారం పేర్కొన్నారు.