by Suryaa Desk | Tue, Oct 08, 2024, 09:20 AM
బెల్లంపల్లిలో ప్రభుత్వ స్థలాల ఆక్రమణలను అడ్డుకోవాలని ఎంసిపిఐయూ నాయకులు రాజేంద్రప్రసాద్, వెంకటేష్ లు ప్రజావాణిలో కలెక్టర్ కుమార్ దీపక్ కు దరఖాస్తు సోమవారం సమర్పించారు.
ప్రభుత్వ భూములను కొందరు నాయకులు అధికారులతో కుమ్మక్కై ప్లాట్ గా చేసి విక్రయిస్తున్నారని ఆరోపించారు. బూడిదగడ్డ బస్తిలోని అంగన్వాడి కేంద్రం సరిగా తెరవడం లేదని విధులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న టీచర్ పై చర్యలు తీసుకోవాలని కోరారు.